సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

1, మే 2010, శనివారం

విశేష రచనల ‘రచన’ తాజా సంచిక!

‘రచన’ ఇంటింటి పత్రిక  మే నెల సంచిక  నిన్న మార్కెట్లో విడుదలైంది.
‘చందమామ’లో చిరస్మరణీయమైన జానపద ధారావాహికలను రాసిన దాసరి సుబ్రహ్మణ్యం గారి స్మృతి సంచిక ఇది.

సంపాదకుడు శాయి గారి మాటల్లో- 

‘.... అభిమానుల  ఆలోచనలన్నీ అక్షరరూపంలో వరదగోదారిలా కట్టలు తెంచుకుని ప్రవహించసాగేయి. వాటన్నింటినీ ఒక ‘మాయా సరోవరం’లోకి చేర్చే ప్రయత్నమే ఈ స‘చిత్ర’ ప్రత్యేక సంచిక’.  


ఈ  విశేషాలు  విహంగ వీక్షణంగా ఓసారి...

ముఖచిత్రమే పాఠకుల్ని  విహంగ వీక్షణం చేయించే ‘చిత్రా ’ గీసిన అద్భుత  వర్ణ చిత్రం! దానికి  ‘అవతార్’ బొమ్మను జోడించి ఆర్టిస్టు  అన్వర్ రూపుదిద్దిన  ‘దాసరి సుబ్రహ్మణ్యం గారి జ్వాలాద్వీపంలో హాలీవుడ్’!

దాసరి గారు రాసిన  12 జానపద ధారావాహికల పరిచయాలూ, విశ్లేషణా; మంత్రనగరి సరిహద్దులను దాటించి, అపూర్వ కథా వీధుల్లోకి ఉత్కంఠభరితంగా  ప్రవేశపెట్టే  చిత్రా బొమ్మలూ అన్నీ ఒకే చోటే కనిపిస్తాయి.  

ఇవే కాదు...

* దాసరి గారి వ్యక్తిత్వంపై, ఆయన రచనలపై   ప్రత్యేక వ్యాసాలూ, స్మృతులూ.
* డిసెంబరు 1964లో ‘యువ’లో దాసరి గారు రాసిన ‘అంతా కనికట్టు’ కథ.
* దాసరి సుబ్రహ్మణ్యం కథా సంపుటి ‘ఇంద్రాణి’కి 1955 ఏప్రిల్ లో కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన పీఠిక.

* చందమామ ప్రేరణతో శాయి-చంద్ర గార్లు 42 ఏళ్ళ క్రితం  రాసి, గీసిన ‘రాతి కత్తి’ బొమ్మల కామిక్ కథ!
* దాసరి గారు మిత్రులకు రాసిన ఐదు లేఖల ఫొటో కాపీలు యథాతథంగా‘ప్రముఖుల ఉత్తరాలు’ శీర్షికలో!
* ‘చిత్రా’ కాంతులూ, శంకర్ జ్ఞాపకాలూ.

* గళ్ళ నుడికట్టు ని ఇష్టపడే వారికి రెట్టింపు సంతోషం కలిగించే అదనపు  ప్రత్యేక పజిలింగ్ పజిల్-‘మంత్ర తంత్ర   వీరోచిత మాయా మర్కట దాగుడుమూతలు’!
   పూర్తి చేసి పంపినవారికి ఓ అద్భుత జానపద నవల బహుమతి !

 ఇంకా... మరెన్నో!

సాహితీ అభిమానులూ, చందమామ ప్రియులూ  తమ మిత్రులకు  కానుకగా ఇవ్వదగ్గ  ఈ ప్రత్యేక సంచిక
వెల-  రూ.50.

చిరునామా-  
RACHANA Telugu Monthly  1-9-286/2/P Vidyanagar
Hyderabad – 500 044
ఈ -మెయిల్ : rachanapatrika@gmail.com
ఫోన్ : 040 – 2707 1500
మొబైల్  : + 99485 77517
వెబ్ సైట్ : www.rachana.net

చందమామ రాజు గారి ఈ బ్లాగు పోస్టు  కూడా చూడండి!

1 కామెంట్‌:

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

అయితే తొందరగా కొనెయ్యాలి. :)