రచయిత్రి రంగనాయకమ్మ |
మనసులో భావాలను అక్షరాల్లోకీ, అందమైన వాక్యాల్లోకీ మార్చి చూసుకుంటే ఎంత బావుంటుందో! బ్లాగర్లకు ఇది నిత్యం అనుభవమే. స్వేచ్ఛగా, హాయిగా, పదునుగా రాయటం గొప్ప నేర్పు.
కవిత్వమే కాదు, వచనం కూడా ఆల్కెమీయే... రసవాదమే.
ఆ రహస్యం శ్రీశ్రీకీ, కొ.కు.కీ తెలుసు.
చలం గారికి తెలుసు,
రంగనాయకమ్మ గారికి తెలుసు.
ముళ్ళపూడి వెంకట రమణ గారు ...
ఇంకా చాలామంది ఈ జాబితాలోకి వస్తారనుకోండీ.
ఆ రహస్యం శ్రీశ్రీకీ, కొ.కు.కీ తెలుసు.
చలం గారికి తెలుసు,
రంగనాయకమ్మ గారికి తెలుసు.
ముళ్ళపూడి వెంకట రమణ గారు ...
ఇంకా చాలామంది ఈ జాబితాలోకి వస్తారనుకోండీ.
ఇక్కడ ప్రస్తుతం నేను చెప్పదల్చుకున్నది- అందంగా రాయటం గురించి కాదు, తప్పుల్లేకుండా సక్రమంగా వాక్యాలు రాయటం గురించి.
రోజూ అక్షరాలతో సహవాసం చేసే పాత్రికేయులే అసూయ పడేలా ‘ఈజ్’తో రాసేవారు కొందరు మన తెలుగు బ్లాగావరణంలో కనిపిస్తారు. అలాగే భాష విషయంలో తప్పటడుగులు వేసేవారు కూడా ఉన్నారనుకోండీ.
చిన్నప్పటినుంచీ కథలూ, నవలలూ ఇష్టంతో చదివేవారూ; లేఖలూ, డైరీలూ అలవాటున్నవారూ తెలుగును కొంత బాగా రాయగలుగుతారు.
ఇలాంటి నేపథ్యం ఉన్న నాకు కూడా ఎంతో ఉపయోగపడిన పుస్తకం - ‘వాడుక భాషే రాస్తున్నామా?’.
ఇలాంటి నేపథ్యం ఉన్న నాకు కూడా ఎంతో ఉపయోగపడిన పుస్తకం - ‘వాడుక భాషే రాస్తున్నామా?’.
పత్రికా రంగంలో తొలి అడుగులు వేస్తున్నపుడు నా కోసమే రంగనాయకమ్మ గారు రాశారా అన్నట్టు ఈ రచన ఆంధ్రజ్యోతి వీక్లీలో సీరియల్ గా ప్రారంభమైంది.
శ్రద్ధగా వారం వారం చదివేవాణ్ని.
శ్రద్ధగా వారం వారం చదివేవాణ్ని.
భాషకు సంబంధించి నాలో స్పష్టంగా, అస్పష్టంగా ఉన్న చాలా సందేహాలను తీర్చిందీ రచన. తెలియని విషయాలను నేర్పింది. తర్వాత పుస్తక రూపంలో వచ్చింది.
ఇదేదో అకడమిక్ పుస్తకంగా నీరసంగా ఉంటుందనుకోవద్దు. తిరుగులేని తర్కం, వ్యంగ్యం, హాస్యం ముప్పేటలా అల్లుకుని పాఠకులను ఆసక్తిగా చదివిస్తాయి.
తెలుగును సక్రమంగా రాయాల్సిన పాత్రికేయులకు నేను రికమెండ్ చేసే పుస్తకాల్లో దీనికి మొదటి స్థానం. ఈ పుస్తకం చదవని బ్లాగర్ మిత్రులూ, బ్లాగ్ వీక్షకులూ కూడా ఓసారి చదవాలని నా సూచన.
తెలుగును సక్రమంగా రాయాల్సిన పాత్రికేయులకు నేను రికమెండ్ చేసే పుస్తకాల్లో దీనికి మొదటి స్థానం. ఈ పుస్తకం చదవని బ్లాగర్ మిత్రులూ, బ్లాగ్ వీక్షకులూ కూడా ఓసారి చదవాలని నా సూచన.
దాదాపు 19సంవత్సరాల క్రితం పుస్తకంగా అందుబాటులోకి వచ్చిన ఈ రచనకు ఇప్పటికీ ప్రాధాన్యం ఉంది. దీనికి రుజువులు ఇప్పటికీ తెలుగు పత్రికల్లో వస్తున్నరకరకాల దోషాలే. (ఆ దోషాలన్నీ ఈ రచనలో ప్రస్తావించినవే).
‘బడు’ వాడకం గురించి భాషావేత్త చేకూరి రామారావు గారి వాదనలూ, రంగనాయకమ్మ గారి ప్రతివాదనలూ ఈ పుస్తక పాఠకులకు బోనస్.
‘‘భాషని ‘రాయడం’ దగ్గిరికి వచ్చేటప్పటికే వస్తుంది గొడవ అంతా. మాట్లాడేటప్పడు ఎన్నడూ జరగని రకరకాల తప్పులు, రాసే భాషలో జరుగుతూ వుంటాయి’’ అంటూ ఈ రచన కొనసాగిస్తారు రంగనాయకమ్మగారు.
దినపత్రికల్లో కొంతకాలం వచ్చిన దోషాలను శ్రద్ధగా సేకరించి, వర్గీకరించి ఓ పరిశోధన లాగా ఈ రచన చేశారు.
దినపత్రికల్లో కొంతకాలం వచ్చిన దోషాలను శ్రద్ధగా సేకరించి, వర్గీకరించి ఓ పరిశోధన లాగా ఈ రచన చేశారు.
2007 ఫిబ్రవరిలో వచ్చిన 3వ ముద్రణ ప్రస్తుతం అందుబాటులో ఉంది.
డెమ్మీ సైజులో 175 పేజీల ఈ పుస్తకం ప్రతులకు సంప్రదించాల్సిన చిరునామా-
‘అరుణా పబ్లిషింగ్ హౌస్’, విజయవాడ. (ఫోన్ 0866 - 2431181).
విశాలాంధ్ర ప్రచురణాలయాల్లో, ఇతర పుస్తక కేంద్రాల్లో కూడా దొరుకుతుంది.
ధర 30 రూపాయిలు.
కినిగె సైట్ ద్వారా ఈ -బుక్ గా కూడా కొనుగోలు చేయవచ్చు. లింకు-
http://kinige.com/kbook. php?id=1026&name=Vaduka+ Bhashe+Rastunnaamaa
డెమ్మీ సైజులో 175 పేజీల ఈ పుస్తకం ప్రతులకు సంప్రదించాల్సిన చిరునామా-
‘అరుణా పబ్లిషింగ్ హౌస్’, విజయవాడ. (ఫోన్ 0866 - 2431181).
విశాలాంధ్ర ప్రచురణాలయాల్లో, ఇతర పుస్తక కేంద్రాల్లో కూడా దొరుకుతుంది.
ధర 30 రూపాయిలు.
కినిగె సైట్ ద్వారా ఈ -బుక్ గా కూడా కొనుగోలు చేయవచ్చు. లింకు-
http://kinige.com/kbook.