రచయిత్రి రంగనాయకమ్మ |
ఆ రహస్యం శ్రీశ్రీకీ, కొ.కు.కీ తెలుసు.
చలం గారికి తెలుసు,
రంగనాయకమ్మ గారికి తెలుసు.
ముళ్ళపూడి వెంకట రమణ గారు ...
ఇంకా చాలామంది ఈ జాబితాలోకి వస్తారనుకోండీ.
రోజూ అక్షరాలతో సహవాసం చేసే పాత్రికేయులే అసూయ పడేలా ‘ఈజ్’తో రాసేవారు కొందరు మన తెలుగు బ్లాగావరణంలో కనిపిస్తారు. అలాగే భాష విషయంలో తప్పటడుగులు వేసేవారు కూడా ఉన్నారనుకోండీ.
ఇలాంటి నేపథ్యం ఉన్న నాకు కూడా ఎంతో ఉపయోగపడిన పుస్తకం - ‘వాడుక భాషే రాస్తున్నామా?’.
శ్రద్ధగా వారం వారం చదివేవాణ్ని.
తెలుగును సక్రమంగా రాయాల్సిన పాత్రికేయులకు నేను రికమెండ్ చేసే పుస్తకాల్లో దీనికి మొదటి స్థానం. ఈ పుస్తకం చదవని బ్లాగర్ మిత్రులూ, బ్లాగ్ వీక్షకులూ కూడా ఓసారి చదవాలని నా సూచన.
దినపత్రికల్లో కొంతకాలం వచ్చిన దోషాలను శ్రద్ధగా సేకరించి, వర్గీకరించి ఓ పరిశోధన లాగా ఈ రచన చేశారు.
డెమ్మీ సైజులో 175 పేజీల ఈ పుస్తకం ప్రతులకు సంప్రదించాల్సిన చిరునామా-
‘అరుణా పబ్లిషింగ్ హౌస్’, విజయవాడ. (ఫోన్ 0866 - 2431181).
విశాలాంధ్ర ప్రచురణాలయాల్లో, ఇతర పుస్తక కేంద్రాల్లో కూడా దొరుకుతుంది.
ధర 30 రూపాయిలు.
కినిగె సైట్ ద్వారా ఈ -బుక్ గా కూడా కొనుగోలు చేయవచ్చు. లింకు-
http://kinige.com/kbook.