ఎప్పుడో 61 సంవత్సరాల క్రితం ఎంటీవీ ఆచార్య గారు ‘చందమామ’కు వేసిన ముఖచిత్రం ఈ ఫిబ్రవరి సంచికలో పునర్ముద్రించారు. ఏకకాలంలో విభిన్నరూపులతో వేర్వేరుచోట్ల కనపడే కృష్ణ లీలలను నారదుడు ఆశ్చర్యంతో చూసే దృశ్యమిది.
అప్పటి సంచిక చూడకపోయినా ఇంటర్నెట్ పుణ్యమా అని ఆ సంచిక పీడీఎఫ్ కాపీ రెండు మూడేళ్ళ క్రితమే చూడగలిగాను. మళ్ళీ ఫిబ్రవరి సంచికలో ఆ ముఖచిత్రం దర్శనమిచ్చింది.
ఈ రెండు ముఖచిత్రాలూ ఇక్కడ చూడండి.
నదీ తీరంలో చెట్టుకింద మైమరిచి వేణుగానం చేస్తున్న కృష్ణుడి బొమ్మ చాలా బాగుంది.
దాన్ని విడిగా...
పాత బొమ్మలను రంగుల పరంగా, స్పష్టత కోణంలో ‘ఇంప్రొవైజ్ ’ చేయటం అభినందనీయం. అయితే పాత బొమ్మల ఒరిజినాలిటీ, యాంటీక్ వాల్యూ ని విస్మరించలేం.
పాత కథలను అప్పట్లో చదివినా చదవకపోయినా బొమ్మల్లోని వాతావరణం, అలనాటి ఇళ్ళూ, వాకిళ్ళ , అలంకరణల నేపథ్యం అందమైన గతంలోకి ప్రయాణించేలా చేస్తుంది.
అందుకే ఇప్పుడు కొత్త చందమామను మిస్సయితే మంచి పాత కథలనూ, కనువిందు చేసే బొమ్మలనూ మిస్సవాల్సివస్తుందని కొంటున్నాను!
ఫిబ్రవరి సంచికలోనే ‘ఎవరు జూదగాడు?’ అనే కథ చిత్రా బొమ్మతో వచ్చింది.
దీన్ని చూడగానే ఇది ‘మాయా సరోవరం’ ఆరంభ సంచికకు వేసిన తొలి బొమ్మ అని అర్థమైపోయింది.
ఈ కథకు కొత్త బొమ్మను వేయించకుండా ఎప్పుడో 36 ఏళ్ళక్రితం ప్రచురించిన సీరియల్ కు చిత్రా వేసిన బొమ్మ గుర్తొచ్చి, దాన్ని ఉపయోగించవచ్చనే ఆలోచన ఎవరికి వచ్చిందో ! అలా గుర్తుకురావటం మెచ్చుకోదగిందే.
కానీ మెచ్చుకోలేని విషయం ఏమిటంటే... బహుళ పాఠకాదరణ పొందిన సీరియల్స్ లోని బొమ్మలను ఇలా సందర్భం కుదిరింది కదా అని ఎడాపెడా వాడేసెయ్యటం! ఆ సీరియల్ తో, నాటి చిత్రాలతో పెనవేసుకునివున్న అందమైన పాత జ్ఞాపకాలను ఇది మసకబారుస్తుంది.
మాయా సరోవరం నాయకుడు జయశీలుడు మొదట్లో జూదరి కావొచ్చు కానీ, జూదరుల కథ దొరికింది కదా అని ఆ బొమ్మను వెతికి పట్టుకుని, వాడేసెయ్యటం ఏం బాగుందీ?
చందమామలో వచ్చే ప్రతి బేతాళ కథలోనూ చివరి బొమ్మ తెలిసిందే కదా? ‘శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కే’ బేతాళుడూ, మౌనభంగం తర్వాత జరిగిన ఈ పరిణామానికి అవాక్కై చూసే విక్రమార్కుడూ , శ్మశానం, ఒక పక్కకు వంగిన పురాతనమైన చెట్టూ .. వీటితో ఉండే బొమ్మను వందలాదిగా ఎప్పటికప్పుడు కొత్తవి వేయించిన చరిత్ర ‘చందమామ’ది.
ఆ పత్రికలో ఇలా జరగటం ఆశ్చర్యంగానే ఉంది.
అయితే ఒక్క స్వల్పలోపం లోపమే కాదు, పట్టించుకోదగ్గది కాదని ‘కుమార సంభవం’లో కాళిదాసు చందమామను (పోలిక చెపుతూ) వెనకేసుకొస్తాడు. ఎలా అంటే... ‘ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతీందోః కిరణేష్వివాంకః ’ (చంద్రుడికి ఉన్న ఎన్నో శుభ గుణాల మధ్య మచ్చ ఉన్నంతమాత్రాన నింద రాలేదు కదా ).
ఆ రకంగా చందమామ పత్రికకు కూడా ఇదేమంత లోపం కాదని ‘చంపి’ల్లో కొందరైనా సమర్థించుకోవచ్చనుకోండీ!
అప్పటి సంచిక చూడకపోయినా ఇంటర్నెట్ పుణ్యమా అని ఆ సంచిక పీడీఎఫ్ కాపీ రెండు మూడేళ్ళ క్రితమే చూడగలిగాను. మళ్ళీ ఫిబ్రవరి సంచికలో ఆ ముఖచిత్రం దర్శనమిచ్చింది.
ఈ రెండు ముఖచిత్రాలూ ఇక్కడ చూడండి.
నదీ తీరంలో చెట్టుకింద మైమరిచి వేణుగానం చేస్తున్న కృష్ణుడి బొమ్మ చాలా బాగుంది.
దాన్ని విడిగా...
పాత బొమ్మలను రంగుల పరంగా, స్పష్టత కోణంలో ‘ఇంప్రొవైజ్ ’ చేయటం అభినందనీయం. అయితే పాత బొమ్మల ఒరిజినాలిటీ, యాంటీక్ వాల్యూ ని విస్మరించలేం.
అలనాటి వెన్నెల
చందమామ వైభవం అంతా గతంలోనే కాబట్టి పాత కథలను చిత్రా, శంకర్ ల బొమ్మలతో పునర్ముద్రించటం నాలాంటి పాఠకులకు సంతోషం కలిగిస్తుంటుంది.అందుకే ఇప్పుడు కొత్త చందమామను మిస్సయితే మంచి పాత కథలనూ, కనువిందు చేసే బొమ్మలనూ మిస్సవాల్సివస్తుందని కొంటున్నాను!
ఫిబ్రవరి సంచికలోనే ‘ఎవరు జూదగాడు?’ అనే కథ చిత్రా బొమ్మతో వచ్చింది.
దీన్ని చూడగానే ఇది ‘మాయా సరోవరం’ ఆరంభ సంచికకు వేసిన తొలి బొమ్మ అని అర్థమైపోయింది.
ఈ కథకు కొత్త బొమ్మను వేయించకుండా ఎప్పుడో 36 ఏళ్ళక్రితం ప్రచురించిన సీరియల్ కు చిత్రా వేసిన బొమ్మ గుర్తొచ్చి, దాన్ని ఉపయోగించవచ్చనే ఆలోచన ఎవరికి వచ్చిందో ! అలా గుర్తుకురావటం మెచ్చుకోదగిందే.
కానీ మెచ్చుకోలేని విషయం ఏమిటంటే... బహుళ పాఠకాదరణ పొందిన సీరియల్స్ లోని బొమ్మలను ఇలా సందర్భం కుదిరింది కదా అని ఎడాపెడా వాడేసెయ్యటం! ఆ సీరియల్ తో, నాటి చిత్రాలతో పెనవేసుకునివున్న అందమైన పాత జ్ఞాపకాలను ఇది మసకబారుస్తుంది.
మాయా సరోవరం నాయకుడు జయశీలుడు మొదట్లో జూదరి కావొచ్చు కానీ, జూదరుల కథ దొరికింది కదా అని ఆ బొమ్మను వెతికి పట్టుకుని, వాడేసెయ్యటం ఏం బాగుందీ?
చందమామలో వచ్చే ప్రతి బేతాళ కథలోనూ చివరి బొమ్మ తెలిసిందే కదా? ‘శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కే’ బేతాళుడూ, మౌనభంగం తర్వాత జరిగిన ఈ పరిణామానికి అవాక్కై చూసే విక్రమార్కుడూ , శ్మశానం, ఒక పక్కకు వంగిన పురాతనమైన చెట్టూ .. వీటితో ఉండే బొమ్మను వందలాదిగా ఎప్పటికప్పుడు కొత్తవి వేయించిన చరిత్ర ‘చందమామ’ది.
ఆ పత్రికలో ఇలా జరగటం ఆశ్చర్యంగానే ఉంది.
అయితే ఒక్క స్వల్పలోపం లోపమే కాదు, పట్టించుకోదగ్గది కాదని ‘కుమార సంభవం’లో కాళిదాసు చందమామను (పోలిక చెపుతూ) వెనకేసుకొస్తాడు. ఎలా అంటే... ‘ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతీందోః కిరణేష్వివాంకః ’ (చంద్రుడికి ఉన్న ఎన్నో శుభ గుణాల మధ్య మచ్చ ఉన్నంతమాత్రాన నింద రాలేదు కదా ).
ఆ రకంగా చందమామ పత్రికకు కూడా ఇదేమంత లోపం కాదని ‘చంపి’ల్లో కొందరైనా సమర్థించుకోవచ్చనుకోండీ!